భరించలేక ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు యత్నించిన ఘటన తమిళనాడులో వెలుగుచూసింది. బాలిక స్నానం చేస్తుండగా వీడియో తీసిన ఇద్దరు యువకులు దాన్ని అడ్డం పెట్టుకుని కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నారు. వేలూర్ జిల్లా తుత్తిపట్టు సమీపంలోని ప్రాంతానికి చెందిన బాలిక(15) ఇటీవలే టెన్త్ పూర్తిచేసింది. ఆమెపై కన్నేసిన అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు స్నానం చేస్తుండగా వీడియో తీసి బెదిరింపులకు గురిచేశారు. తమ కోరికలు తీర్చాలని, చెప్పినట్లు వినకపోతే ఆ వీడియను సోషల్మీడియాలో పోస్ట్ చేస్తామని బ్లాక్మెయిల్ చేశారు. Also Read: ఆదివారం బాలికను ఊరి చివరకు రప్పించిన యువకులు తమ లైంగిక వాంఛలు తీర్చాలని వేధించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు స్థానికుల సాయంతో వెంటనే అడుక్కంపారై ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెకు 80శాతం శరీరం కాలిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UK8PBs
0 Comments