గుజరాత్‌లో మళ్లీ భూకంపం.. 24 గంటలు గడవక ముందే రెండోసారి

గుజరాత్‌ను మరోసారి వణికించింది. 24 గంటలు దాటక ముందే రెండోసారి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 2001లో తీవ్ర విషాదాన్ని నింపిన కచ్ పరిసరాల్లోనే వరుస భూ ప్రకంపనలు సంభవిస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు. సోమవారం (జూన్ 15) మధ్యాహ్నం 12.57 గంటల సమయంలో రాజ్‌కోట్‌ సమీపంలో రెండోసారి భూకంపం చోటు చేసుకుంది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది. రాజ్‌కోట్‌కు వాయవ్య దిశలో 83 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. గుజరాత్‌లో ఆదివారం రాత్రి 8.13 గంటల సమయంలో భూకంపం వచ్చింది. రాజ్‌కోట్‌, కచ్, సౌరాష్ట్ర, అహ్మదాబాద్ ప్రాంతాల్లో భూమి కంపించింది. రిక్టార్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. రాజ్‌కోట్‌కు 122 కిలోమీటర్ల దూరంలో వాయవ్యంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఇళ్లల్లో వస్తువులు, ఫ్యాన్లు కదిలాయి. భూకంపంతో ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి పరుగులు తీశారు. 24 గంటలు గడవక ముందే మరోసారి భూమి కంపించడంతో వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘2020 ఎంత భయంకరమైంది?’ అని పలువురు ట్వీట్ చేశారు. 2001లో తీవ్ర నష్టాన్ని మిగిల్చిన భూకంపాన్ని గుర్తుచేసుకొని ఆందోళనకు గురవుతున్నారు. భారతదేశ చరిత్రలో అత్యంత భయానక భూకంపంగా 2001 నాటి కచ్ భూకంపం మిగిలిపోయింది. నాడు గణతంత్ర దినోత్సవం (2001 జనవరి 26) రోజున ఉదయం 8.45 గంటల సమయంలో గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో సంభవించిన భూకంపం తీవ్ర ఆస్తి, ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. రిక్టార్ స్కేలుపై 7.7గా నమోదైన ఈ భూకంపం కారణంగా ఒక్క గుజరాత్‌లోనే 12 వేల మందికి పైగా మరణించారు. పాకిస్థాన్ సహా పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న భూ ప్రకంపనల్లో మొత్తం 20 వేల మందికి పైగా మరణించారు. On Cam:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3dYwiGt

Post a Comment

0 Comments