అతడి నెత్తిమీద సగం జుట్టు ఊడిపోయింది. అయినప్పటికీ విగ్గు పెట్టుకుని కుర్రాడిలా ఫోజు కొడుతుంటాడు. అందంగా ముస్తాబై ఫోటోలు తీసుకుని వాటిని సోషల్మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు. వాటికి లైకులు, కామెంట్లు పెట్టిన మహిళలతో పరిచయం పెంచుకుని ప్రేమ పేరుతో వలేస్తాడు. వారి ఫోటోలు సేకరించి మార్ఫింగ్ చేసి సోషల్మీడియాలో పెడతానంటూ బ్లాక్మెయిల్ చేస్తూ వారి నుంచి డబ్బు, నగలు దోచుకుంటాడు. ఇలా ఎందరో అమాయక మహిళలను మోసం చేసిన కేటుగాడిని జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. Also Read: కర్నూలు జిల్లా పగిడ్యాలకు చెందిన రాజ్కుమార్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. రాజుపాళెంలో ప్రైవేటు స్కూల్ నిర్వహిస్తున్న రాజ్కుమార్ అక్కడే పనిచేసే ఓ లేడీ టీచర్కు మాయమాటలు చెప్పి కారులో గుంటూరు జిల్లా చిలకలూరిపేట పరిధిలోని ఓ గ్రామానికి తీసుకెళ్లి నిర్బంధించి చిత్రహింసలు పెట్టాడు. కూతురు కనిపించకపోవడంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు యువతి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే బాధితురాలు ఈ నెల 1వ తేదీన అక్కడి నుంచి తప్పించుకుని ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు రాజ్కుమార్ను అరెస్ట్ చేసి విచారించగా అతడి నేరాల చిట్టా బయటపడింది. సోషల్మీడియా పరిచయమైన అనేక మంది మహిళలను నిందితుడు ఇలాగే వేధించినట్లు తేలింది. రాజ్కుమార్పై వివిధ రాష్ట్రాల్లో 12 కేసులు నమోదైనట్లు విచారణలో వెల్లడైంది. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hkweTG
0 Comments