కరోనా రోగికి అమెరికాలో తొలిసారి ఊపిరితిత్తుల మార్పిడి.. ఇండో-అమెరికన్ వైద్యుడి ఘనత

బాధితుడికి విజయవంతమయ్యింది. అమెరికాలో భారత సంతతికి చెందిన అంకిత్‌ భరత్‌ అనే వైద్యుడు ఈ శస్త్రచికిత్స బృందానికి నేతృత్వం వహించారు. కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైన తర్వాత అమెరికాలో ఇలాంటి శస్త్రచికిత్స నిర్వహించడం ఇదే తొలిసారి. చికాగోలోని నార్త్‌వెస్ట్రన్‌ మెడిసిన్‌ ఆసుపత్రిలో 20లలో ఉన్న ఓ యువతికి ఈ శస్త్రచికిత్స నిర్వహించినట్టు వైద్యులు పేర్కొన్నారు. బారినపడ్డ సదరు యువతి ఆరు వారాల పాటు వెంటిలేటర్‌, ఎక్స్‌ట్రాకార్పోరియల్‌ మెంబరేన్‌ ఆక్సిజనేషన్‌ (ఎక్మో)పై ఉండాల్సి వచ్చింది. ఆమెకు కరోనా వైరస్ సోకినప్పుడు రోగనిరోధక ఔషధాలను అందజేశారు. అయినా, ఎలాంటి పురోగతి లేదని, ఊపిరితిత్తులపై దాడిచేసిందన్నారు. దీంతోపాటు బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కూడా ఆమెకు సోకినట్టు తెలిపారు. ఊపిరితిత్తులు చికిత్సకు వీలు కాని స్థాయిలో దెబ్బతిన్నట్లు వైద్యులు జూన్ తొలివారం గుర్తించారు. ఆమెకు రెండు ఊపిరితిత్తులు మార్చాల్సిన అవసరం ఉందని భావించారు. ఆమె ప్రాణాలు కాపాడటానికి అంతకుమించిన మార్గం లేదని, ఆ తర్వాత 48 గంటల్లోనే ఈ శస్త్రచికిత్సను నిర్వహించినట్టు డాక్టర్ అంకిత్ తెలిపారు. ‘కొవిడ్‌-19తో తీవ్ర ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులను కాపాడటానికి ఇదో అవకాశం’ అని వివరించారు. కానీ, ఈ ఆపరేషన్‌ చేయలాంటే రోగికి కరోనా పరీక్షలో ‘నెగిటివ్‌’ రావాల్సి ఉంటుందని అంకిత్‌ చెప్పారు. దీంతో కొన్ని రోజులు ఆమెను నిరీక్షణలో ఉంచాల్సి వచ్చిందన్నారు. ‘ఈ నేపథ్యంలో తొలిసారి ఆమెకు నెగిటివ్‌ వచ్చినప్పుడు అందరం ఆనందించాం. నా జీవితంలో ఇది సంక్లిష్టమైన శస్త్రచికిత్స.. నిజంగా సవాళ్లతో కూడున్న కేసుల్లో ఇది ఒకటి’అని ఆయన వివరించారు. ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్‌లో ఉన్న ఆమెకు ఊపిరితిత్తులు, గుండె సహాయ పరికరాలు తొలగించామని, కోలుకుంటుందని తెలిపారు. కొవిడ్‌ రోగికి ప్రపంచంలోనే తొలిసారిగా గత నెల 26న ఆస్ట్రియాలో ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్‌ జరిగింది. కరోనా వైరస్ మహమ్మారి రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది.. దీంతోపాటు కిడ్నీ, గుండె, రక్తకణాలు, నాడీవ్యవస్థకు కూడా నష్టం కలిగిస్తుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3fsL5K3

Post a Comment

0 Comments