గత వారం హత్యకు గురైన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యోగి సత్యనారాయణ మర్డర్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. మద్యం అలవాటే ఆయన దారుణ హత్యకు కారణమైనట్లు తేల్చారు. హెచ్సీయూలో పనిచేస్తున్న సత్యనారాయణ వారం రోజుల క్రితం నార్సింగి లోని హైదర్ షా కోట నుంచి అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు హిమాయత్ సాగర్ సమీపంలో అతని మృతదేహం లభ్యమైంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సత్యనారాయణ కేసును పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. సత్యనారాయణది సహజ మరణం కాదని.. ఎవరో హత్య చేసినట్లుటీ గుర్తించిన పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు కొనసాగించారు. మృతదేహం లభ్యమైన హిమాయత్ సాగర్ ప్రాంతానికి అన్ని రహదారులలో సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించడంతో చిన్న క్లూ లభ్యమైంది. Also Read: సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా హత్య జరిగిన రోజు సత్యనారాయణ మరో వ్యక్తితో కలసి వెళ్తున్నట్లుగా ఉన్న గుర్తించారు. ఆ వ్యక్తి ఎవరనే విషయంపై ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. మద్యం తాగే అలవాటున్న సత్యనారాయణ తరచూ సమీపంలోని కల్లు కాంపౌండ్కి వెళ్లేవాడు. ఆ సమయంలో కల్లు తాగేందుకు వచ్చే అజీమ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. లాక్డౌన్తో పనిలేక ఇబ్బందులు పడుతున్న అజీమ్ కన్ను సత్యనారాయణపై పడింది. అతని వద్దనున్న బంగారం, డబ్బు కాజేయాలని ప్లాన్ చేశాడు. కల్లు కాంపౌండ్ సమయం దాటిపోయిందని యజమాని చెప్పడంతో బయటికి వెళ్లి తాగుదామని అజీమ్ నమ్మబలికాడు. హోండా యాక్టివా వాహనంపై ఎక్కించుకుని హిమాయత్సాగర్ వైపు తీసుకెళ్లాడు. Read Also: అక్కడికి వెళ్లిన తర్వాత సత్యనారాయణపై ఒక్కసారిగా దాడి చేసి అంతమొందించాడు. సత్యనారాయణ ఒంటిపై ఉన్న బంగారం, నగదు, బైక్ అపహరించి అక్కడి నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37G6n48
0 Comments