సోకిందన్న ఆందోళనతో పలువురు బలవన్మరణానికి పాల్పడిన ఘటనలు దేశంలో చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఢిల్లీలో ఓ ఐఆర్ఎస్ అధికారి కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన వాహనంలోనే యాసిడ్ తాగి తనువుచాలించాడు. తన వల్ల కుటుంబసభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ తీవ్ర నిర్ణయాన్ని తీసుకున్నట్టు సూసైడ్ నోట్ రాసిపెట్టి ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరం. ఆదివారం ద్వారక జిల్లాలో కారులో ఓ వ్యక్తి స్పృహ కోల్పోయి పడి వున్నారన్న సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని..ఆయనను వెంటనే చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. బాధితుడిని ఢిల్లీకి చెందిన ఐఆర్ఎస్ అధికారి శివరాజ్ సింగ్ (56)గా పోలీసులు గుర్తించారు. అయితే, ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగటివ్ రావడం గమనార్హం. కరోనా సోకిందన్న భయంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన వల్ల తన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూసైడ్ నోట్లో రాశారని పోలీసులు తెలిపారు. కారులోపల కూర్చుని యాసిడ్ లాంటి రసాయనం తాగినట్టు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. కుటుంబసభ్యుల నుంచి కూడా వాంగ్మూలం తీసుకుంటామని తెలిపారు. సోమవారం పోస్ట్మార్టమ్ పూర్తయిన తర్వాత కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించనున్నారు. ఇక, 2006 ఐఆర్ఎస్ బ్యాచ్కు చెందిన శివరాజ్ సింగ్ ఆర్కేపురంలోని ఆదాయపు పన్ను శాఖ విభాగంలో అడిషినల్ కమిషనర్గా విధులు నిర్వర్తిస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2UGIV15
0 Comments