ఓ జంట ప్రేమ గ్రామంలో తీవ్ర అలజడికి దారితీసిన ఘటన తమిళనాడులో జరిగింది. తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరన్న ఆందోళనతో ప్రేమజంట పారిపోగా.. ఆగ్రహించిన యువతి కుటుంబసభ్యులు ప్రియుడి ఇంటిపై దాడి చేసి నిప్పు పెట్టారు. వేలూర్ జిల్లా జోలార్పేట సమీప మండలవాడి కామరాజపురానికి చెందిన తిరుపతి అనే యువకుడు, చిన్న మండలవాడికి చెందిన ఓ యువతి నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల వారువ్యతిరేకించారు. దీంతో శుక్రవారం ఈ ప్రేమ జంట పారిపోయింది. Also Read: దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబసభ్యులు, బంధువులు సుమారు 50 మందికి కలిసి శనివారం యువకుడి ఇంటిపై దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి వస్తువులన్ని చిందరవందర చేసి నిప్పు పెట్టారు. వారిని అడ్డుకున్న ముగ్గురు స్థానికులపైనా దాడి చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వాణియంబాడి ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో రూ.లక్ష నగదు, 20 సవర్ల బంగారు నగలు, విలువైన వస్తువులు అగ్నికి ఆహుతైనట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు 20 మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2C8bZZb
0 Comments