కరోనాకు కొత్త భాష్యం చెప్పిన నేత.. మనం నిద్రపోతే వైరస్ నిద్రపోతుందట!

కంటికి కనిపించని మహమ్మారిని ఎలా నియంత్రించాలో తెలియక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. ప్రాణాంతక కరోనాకు వ్యాక్సిన్ కోసం శాస్త్రవేత్తలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, పాకిస్థాన్‌కు చెందిన ఓ రాజకీయ నేత మాత్రం కరోనా కట్టడికి కొత్త బాష్యం చెప్పారు. మనం నిద్ర పోతే వైరస్‌ కూడా నిద్రపోతుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు విని జనం విస్తుపోతున్నారు. వినడానికే నవ్వు తెప్పిస్తున్న ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘వైద్యులు మనల్ని ఎక్కువగా నిద్రపొమ్మని చెబుతుంటారు. మనం ఎక్కువగా నిద్రపోతే వైరస్‌ కూడా ఎక్కువగా నిద్రపోతుంది. అది మనకు హాని చేయదు. మనం నిద్రపోతే అది నిద్రావస్థలోకి వెళుతుంది.. మనం చనిపోతే అప్పుడు అది కూడా చనిపోతుందని’ పాకిస్థాన్ రాజకీయ నేత ఫజల్‌ ఉర్‌ రెహమాన్‌ వ్యాఖ్యానించారు. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన ఎప్పుడు చేశారో స్పష్టతలేదు.. కానీ సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆయన మాలు విని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఫజల్ ఉర్ రెహమాన్ గత రెండు దశాబ్దాలకుపైగా పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. ‘ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ఇతడు ముందే ఎందుకు చెప్పలేదబ్బా అంటూ ఓ వ్యక్తి ట్విటర్‌లో వ్యంగ్యంగా ప్రశ్నించాడు. ‘అయితే ప్రాథమికంగా వైరస్‌ మనల్ని కాపీ కొడుతుందన్న మాట. ఇది చైనా వైరస్‌ కాబట్టి కాపీయే కొడుతుంది. ఇంత అద్భుతమైన సిద్ధాంతం విన్న తరువాత అక్కడున్న వారెవరూ ఆత్మహత్య చేసుకోకూడదని భావిస్తున్నా’ అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఆయన వ్యాఖ్యలు వింటే కరోనా వైరస్ అవమానంతో చచ్చిపోతుందని ఓ వ్యక్త కామెంట్ చేయగా.. వైరస్ మాట్లాడితే ఆయన మాట్లాడుతారా అని సెటెర్ వేశాడు. ప్రస్తుతం ఈ వీడియోకు వేలాది లైక్‌లు, షేర్‌లు రావడం విశేషం.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Yz0dyC

Post a Comment

0 Comments