భారత జవాన్లు బోర్డర్ దాటడం వల్లే ఘటన.. చైనా సంచలన ఆరోపణలు

భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణతో లఢక్‌లో సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సోమవారం (జూన్ 15) రాత్రి జరిగిన ఘర్షణలో ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ స్థాయి అధికారితో పాటు మరో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. అయితే.. భారత జవాన్లు సరిహద్దు దాటి చైనా భూభాగంలోకి చొచ్చుకువచ్చారని.. తమ జవాన్లపై దాడికి దిగారని డ్రాగన్ ఆరోపిస్తోంది. ఈ మేరకు న్యూస్ ఏజెన్సీ ఏఎఫ్‌పీ పేర్కొంది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి కూడా ఇదే ప్రకటన చేసినట్లు చైనా గ్లోబల్ టైమ్స్ వెల్లడించింది. ‘భారత బలగాలు గత రాత్రి నిబంధనలను ఉల్లంఘించి చైనా భూభాగంలోకి వచ్చాయి. సరిహద్దును రెండుసార్లు దాటి వచ్చి చైనా సైనికులతో ఘర్షణకు దిగాయి. దీంతో ఇరుదేశాల సైనికులు ఘర్షణకు దిగి పరస్పరం దాడి చేసుకున్నారు’ అని చైనా విదేశాంగ శాఖ మంత్రి పేర్కొన్నట్లు చైనా గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. సరిహద్దులో నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదని.. దుస్సాహసానికి దిగొద్దని భారత్‌ను ఆయన హెచ్చరించినట్లు తెలిపింది. గాల్వన్ లోయలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇరు దేశాలు చర్యలు చేపట్టినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ తెలిపింది. ఇరుదేశాల మేజర్ జనరల్స్ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరు వైపులా ప్రాణ నష్టం జరిగిందని ఇండియన్ ఆర్మీ ప్రకటించినట్లు ఏఎన్‌ఐ తెలిపింది. రక్షణ శాఖ మంత్రి అత్యవసర సమావేశం రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. లఢక్‌లో తాజా పరిస్థితులపై ఆరా తీశారు. భారత సైనిక దళాల అధిపతి (సీడీఎస్) బిపిన్ రావత్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్‌నాథ్ ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. మరోవైపు.. భారత్, చైనా మధ్య ఉద్రిక్తల నేపథ్యంలో ఆర్మీ చీఫ్ ఎంఎం నరావణె తాను షెడ్యూల్ చేసుకున్న పఠాన్‌కోట్ మిలిటరీ స్టేషన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. Must Read: Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2CcrgIs

Post a Comment

0 Comments