అత్తని నరికేసిన అల్లుడు.. ఆమె తలని టవల్‌లో చుట్టి.. ఘోరం

కంప్యూటర్ కాలంలోనూ చేతబడులు, క్షుద్రపూజల వంటి మూఢనమ్మకాలతో కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. చేశారన్న అనుమానంతో అమాయకులను అతి కిరాతకంగా అంతమొందిస్తున్నారు. తన కూతురు చనిపోవడానికి అత్తే కారణమని భావించిన అల్లుడు ఆమె తల నరికేసిన అత్యంత అమానుష ఘటన తాజాగా వెలుగుచూసింది. ఈ దారుణ ఘటన ఒడిశాలోని జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని బారిపదా ఏరియా నౌషాహి గ్రామానికి చెందిన బుధురాం సింగ్(30) కుమార్తె మూడు రోజుల కిందట మరణించింది. తన మేనత్త చంపా సింగ్(60) చేతబడి చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని కోపం పెంచుకున్న బుధురాం దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి వరండాలో నిద్రిస్తున్న అత్తని బయటకు లాగి కిరాతకంగా చంపేశాడు. గొడ్డలితో నరికి దారుణంగా చేశాడు. Also Read: అనంతరం ఆమె తలను మొండెం నుంచి వేరుచేసి కండువాలో చుట్టి బయల్దేరాడు. సుమారు 13 కిలోమీటర్లు నడిచి నేరుగా పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నాడు. టవల్‌లో ఉన్న తల తీసి తానే హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. ఒక్కసారిగా షాక్‌కి గురైన పోలీసులు వెంటనే తేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గ్రామానికి వెళ్లి ఆమె మొండెం స్వాధీనం చేసుకున్నారు. చేతబడి చేయడం వల్లే తన కూతురు చనిపోయిందని అనుమానపడిన బుధురాం.. అందుకు కారణమని భావించి చంపా సింగ్‌ని దారుణంగా హత్య చేసినట్లు స్టేషన్ ఇన్‌చార్జి స్వర్ణలత మింజ్ తెలిపారు. అతని నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డలిని కూడా స్వాధీనం చేసుకున్నారు. అత్తని బయటకు లాగి అల్లుడు గొడ్డలితో దాడి చేసే సమయంలో చాలా మంది ఉన్నా.. ఎవరై అడ్డుకునే సాహసం చేయలేదు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/30KATrV

Post a Comment

0 Comments