కరోనా వ్యాక్సిన్ ఒక్కో డోసు ధర రూ.250..? సప్లయ్ చేయనున్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్!

ధర విషయంలో సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులేస్తోంది. ప్రపంచంలోకెల్లా పెద్ద మొత్తంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసే సంస్థగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ గుర్తింపు పొందింది. వ్యాక్సిన్ ఒక్కో డోస్ ధర రూ.250గా ఉండే అవకాశం ఉందని సమాచారం. ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. సీరమ్ సీఈవో అదర్ పూనావాలా ఇంతకు ముందు మాట్లాడుతూ.. భారత్‌లోని ప్రయివేట్ మార్కెట్లో వ్యాక్సిన్ డోస్ ధర రూ. 1000గా ఉండొచ్చన్నారు. భారీ మొత్తంలో వ్యాక్సిన్ కోసం ప్రభుత్వాలు ఒప్పందం చేసుకుంటే ధర తగ్గే అవకాశం ఉందన్నారు. ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసే ముందు భారతీయులకు టీకా సరఫరా చేయడానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని పూనావాలా తెలిపారు. భారత్‌లో ఇప్పటి వరకూ 9.7 మిలియన్ల కరోనా కేసులు నమోదయ్యాయి. కేసుల విషయంలో అమెరికా తర్వాతి స్థానంలో భారత్ ఉంది. ఫైజర్, ఆస్ట్రాజెనికా రూపొందించిన వ్యాక్సిన్లను అత్యవసర అవసరానికి వాడే విషయమై భారత్ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36UyRZ1

Post a Comment

0 Comments