మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు .. కరోనా వైరస్, వ్యాక్సిన్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ను అభివృద్ధి చేసే సాంకేతికత వేగవంతమైందని అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది మార్చి నాటికి కరోనాకు 6 రకాల టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ అభివృద్ధిలో సాధించిన వేగం భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తోందన్నారు. 2022 నాటికి కరోనా వైరస్ పూర్తిగా అంతమైపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. Must Read: కొవిడ్-19 మహమ్మారి తీవ్ర సంక్షోభాన్ని సృష్టించినప్పటికీ.. రిమోట్ లెర్నింగ్, టెలీ మెడిసిన్, డిజిటల్ ఫైనాన్స్ లాంటి రంగాల్లో ఎంతో పురోగతి సాధించామని బిల్ గేట్స్ పేర్కొన్నారు. అయితే.. విషయంలో పేద, ధనిక దేశాల మధ్య ఘర్షణ ఏర్పడవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని దేశాలకు సమానంగా వ్యాక్సిన్ అందేలా ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. సింగపూర్లో మంగళవారం (డిసెంబర్ 8) జరిగిన ఫిన్టెక్ సమావేశాన్ని ఉద్దేశించి బిల్ గేట్స్ విర్చువల్గా మాట్లాడుతూ కరోనా వైరస్, టీకా గురించి ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇండియా అవలంభిస్తున్న విధానాలను కొనియాడారు. డిజిటల్ ఆర్థిక కార్యకలాపాల నిర్వహణలో భారత్ అద్భుతమైన పద్ధతులను అవలంభిస్తోందని ప్రశంసించారు. ఇవే విధానాల్ని ఇతర దేశాల్లోనూ అమలు చేసేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని వెల్లడించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3oNZZzd
0 Comments