బాబోయ్!! వీడు మామూలోడు కాదు.. ఆఫీస్ అవర్స్‌లో చోరీలు, వీకెండ్స్‌లో పార్టీలు.. షాకింగ్

ఆఫీస్‌కి వెళ్లొచ్చినట్లు ఎంచక్కా చోరీలకు వెళ్తాడు. సాయంత్రం కాగానే ఆఫీస్‌ నుంచి ఇంటి కొచ్చినట్లు వచ్చేస్తాడు. వీకెండ్స్‌లో పార్టీలతో ఎంజాయ్ చేస్తాడు. దొంగతనాలను కూడా ఒ టైమింగ్‌లో పద్ధతి ప్రకారం చేస్తున్న ఘరానా దొంగని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. టోలీచౌకీ ఏరియాలోని పారామౌంట్ కాలనీకి చెందిన కాజాం అలీ ఖాన్ అలియాస్ సూర్య అన్న(28) టెన్త్ వరకూ చదివాడు. అనంతరం తన తండ్రితో కలసి ఓ ఫంక్షన్ హాల్లో పనిచేసేవాడు. చెడు వ్యవసనాలకు బానిసైన కాజాం 16 ఏళ్లకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. అయితే ఈ దొంగ రూటే సెపరేటు. ఎలక్ట్రీషియన్‌లా రెడీ అయ్యి.. జేబులో టెస్టర్ పెట్టుకుని నీట్‌గా బయటకు వస్తాడు. విలాసవంతమైన అపార్టుమెంట్లు, విల్లాలనే టార్గెట్ చేసుకుంటాడు. వాచ్‌మెన్ వద్దకు వెళ్లి ఎలక్ట్రీషియన్‌ అని చెప్పి అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో పలుమార్లు పైకి కిందకు తిరుగుతూ రెక్కీ చేస్తాడు. ఆ సమయంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీకి వెళ్తాడు. తాళాలు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి చోరీలు చేస్తాడు. డబ్బు, బంగారం మినహా మరే ఇతర విలువైన వస్తువులను ముట్టుకోడు. మళ్లీ దర్జాగా బయటికి వెళ్లిపోతాడు. అది కూడా కేవలం ఆఫీస్ వేళల్లోనే దొంగతనాలు చేయడం అతని అలవాటు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోపు మాత్రమే చోరీలు చేస్తాడు. 5 దాటితే ఆఫీస్ నుంచి వెళ్లిపోతున్నట్లు ఇంటికి చేరతాడు. వారంలో ఐదు రోజులు మాత్రమే చోరీలు చేస్తాడట. వీకెండ్స్‌లో చోరీ చేసిన సొమ్ముతో ఎంజాయ్ చేస్తాడు. Also Read: ఇలా ఇప్పటికే అతనిపై సుమారు 86 కేసులు నమోదైనట్లు సమాచారం. గతంలో మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడ్డ సమయంలో పీడీ యాక్ట్ నమోదు చేసి మరీ జైలుకి పంపారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో బయటికొట్టిన కాజాం 16 దొంగతనాలకు పాల్పడ్డాడు. , మహబూబ్‌నగర్‌లలో జరిగిన చోరీ కేసుల్లో గాలించిన పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అరెస్టు చేశారు. అతని వద్ద భారీ మొత్తంలో బంగారం లభ్యమైంది. సుమారు రూ.52 లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నారు. నాలుగు బైక్‌లు, మొబైల్ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. Read Also:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/36Zdhmb

Post a Comment

0 Comments