మాకు కానుకలొద్దు.. రైతులకు విరాళాలు ఇవ్వండి: కర్షకులకు కొత్త జంట వినూత్న సాయం

వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తోన్న రైతాంగానికి అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. అంతర్జాతీయంగానూ రైతుల ఆందోళనలపై తీవ్ర చర్చ జరుగుతోంది. వారు డిమాండ్లలో న్యాయం ఉందని, సందేహాలను కేంద్రం పొగొట్టాలనే వాదన వినిపిస్తోంది. ఇదే సమయంలో అన్నదాతల ఉద్యమానికి పలువురు ఆర్ధికంగా సాయం చేయడానికి ముందుకొస్తున్నారు. తాజాగా, ఓ వరుడి కుటుంబం రైతులకు వినూత్నంగా బాసటగా నిలిచింది. తమ ఇంటిలో వివాహా వేడుకకు వచ్చిన అతిథులు బహుమతులు ఇవ్వవద్దని, దానికి బదులుగా రైతుల కోసం విరాళాలు ఇవ్వాలని సూచించారు. ఈ ఘటన పంజాబ్‌లో శ్రీ ముక్త్సర్ సాహిబ్ పట్టణంలో చోటుచేసుకుంది. శ్రీముక్త్సర్ సాహిబ్ పట్టణానికి చెందిన యువకుడు అభిజిత్ సింగ్‌, అతడి కుటుంబసభ్యులు వివాహ విందు సందర్భంగా రైతుల కోసం ఏదైనా సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో వివాహ వేడుకకు హాజరైన అతిథులు తమకు బహుమతులు ఇవ్వవద్దని, దానికి బదులుగా వ్యవసాయ చట్టాలపై ఉద్యమిస్తున్న రైతులకు కొంత మొత్తాన్ని విరాళంగా అందజేయాలని ఓ డబ్బాను ఏర్పాటు చేశారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు సాయం చేయడానికి తన పెళ్లికి వచ్చిన అతిథులను బహుమతులకు బదులుగా విరాళాలు ఇవ్వాలని కోరినట్లు వరుడు అభిజిత్ సింగ్ తెలిపారు. తన వివాహ వేడుకను సైతం రైతులకు ఉపయోగపడేలా విరాళాల సేకరణకు వినియోగించినట్టు సింగ్ వివరించారు. ఉద్యమిస్తున్న రైతులకు అండగా నిలిచిన వరుడిని, అతని కుటుంబాన్ని పలువురు అభినందించారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంత వైరల్ అవుతోంది. వివాహ వేదిక వద్ద ఓ విరాళాల బాక్సును ఉంచిన వరుడి కుటుంబం.. వధూవరులకు కానుకల బదులు రైతుల కోసం విరాళాలు అందజేయాలని సూచించారు. అలాగే, సంగీత్ వేదిక వద్ద మరో ప్రత్యేక బాక్సును ఏర్పాటుచేశారు. వ్యవసాయ చట్టాలపై ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతుల కోసం విరాళాలను బాక్సుల్లో వేయాలని కోరారు. ఈ మొత్తాన్ని వారికి ఆహారం, దుస్తులు, ఇతర నిత్యవసరాల కొనుగోలు కోసం వినియోగిస్తామని తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/370L2DK

Post a Comment

0 Comments