కరీంనగర్: కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య.. కలకలం

జిల్లాలో కాంగ్రెస్ నాయకుడి దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ప్రత్యర్థులు గొడ్డలితో కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా అలజడికి కారణమైంది. శంకరపల్లి మండలం మెట్‌పల్లిలో ఈ దారుణ ఘటన జరిగింది. గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు సంపత్‌కి అదే గ్రామానికి చెందిన ఓదయ్యతో భూతగాదాలున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో పోలీస్ స్టేషన్‌ వరకూ వెళ్లాయి. కేశవపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే పెద్దలు జోక్యం చేసుకుని రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించారు. పెద్దల సమక్షంలో శుక్రవారం పంచాయితీ పెట్టారు. అంతకుముందు రోజే గురువారం సంపత్ పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో మరోమారు ఓదయ్యతో ఘర్షణ జరిగింది. అక్కడే ఉన్న ఓదయ్య కొడుకు జంపయ్య ఆగ్రహంతో ఊగిపోతూ సంపత్‌‌పై గొడ్డలితో దాడి చేశాడు. మెడపై కిరాతకంగా నరకడంతో సంపత్ రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు వదిలాడు. మృతుడికి భార్య రజిత, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపడంతో పోలీసులు భారీగా గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించారు. తన కొడుకు హత్యలో పోలీసుల ప్రమేయం ఉందంటూ మృతుడి తండ్రి రాజలింగం ఆరోపించడం చర్చనీయాంశమైంది. భూవివాదాల నేపథ్యంలో కేశవపట్నం పోలీస్ స్టేషన్‌కి వెళ్తే ఓదయ్యకే వత్తాసు పలికారని ఆరోపించాడు. మండలానికి చెందిన మరో ప్రజాప్రతినిధిపైనా ఆయన విమర్శలు చేశారు. మృతుడి తండ్రి ఆరోపణలు నేపథ్యంలో స్పాట్‌కి చేరుకున్న కేశవపట్నం ఎస్సైని అక్కడి నుంచి అధికారులు పంపించేయడం గమనార్హం. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37UGuhu

Post a Comment

0 Comments