దేశంలో త్వరలోనే కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకునేంత వరకు నిర్లక్ష్యం వహించకూడదని దేశప్రజలను ఆయన విజ్ఞప్తి చేశారు. సోమవారం (డిసెంబర్ 14) అంతర్జాతీయ కరోనా వైరస్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొన్న ఆయన వ్యాక్సిన్ గురించి ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘భారత్లో త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. టీకా తీసుకున్న తర్వాత శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేంతవరకు, రెండో డోసు తీసుకునే వరకూ ఎవ్వరూ నిర్లక్ష్యం వహించవద్దు. ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నా..’ అని అన్నారు. మరోవైపు.. వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే పంపిణీ చేసేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. ఒక్కో విడతలో 100 మందికి వ్యాక్సిన్ అందించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. తొలుత అత్యవసరం ఉన్న వారికి, 60 ఏళ్లకు పైబడిన వృద్ధులకు, వైద్యులు, హెల్త్ వర్కర్లకు వ్యాక్సిన్ అందించనున్నారు. వ్యాక్సిన్ తీసుకుకోదలచిన వారు కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేసిన కో–విన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. Also Read: Must Read: Don't Miss:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/382L7G5
0 Comments