ప్రముఖ విద్యాలయం IIT-మద్రాస్ కరోనా అలజడి రేగింది. క్యాంపస్ లాక్డౌన్లోకి వెళ్లింది. క్యాంపస్లో కరోనా కేసులు కలకలం రేపాయి. ఐఐటీలో ఒక్కసారిగా 71 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. వీరిలో 66 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్యాంపస్లో పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు పాజిటివ్ వ్యక్తుల కారణంగా క్యాంపస్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం క్యాంపస్లో 774 మంది విద్యార్థులున్నట్లు సమాచారం. క్యాంపస్ కరోనా వైరస్కు క్లస్టర్గా మారిన నేపథ్యంలో మళ్లీ లాక్డౌన్ విధించారు. అన్ని డిపార్టుమెంట్లను మూసివేశారు. విద్యార్థులు, ప్రొఫెసర్లను ఇంటి నుంచి పని చేయాల్సిందిగా వ్యక్తిగతంగా ఇ-మెయిల్ సందేశాలు పంపించారు. హాస్టల్లో ప్రస్తుతం 10 శాతం విద్యార్థులు మాత్రమే ఉన్నట్లు తెలిపింది. ఇంకా హాస్టల్లోనే ఉన్న వీరందరికీ ప్యాక్ చేసిన ఆహారం అందిస్తున్నట్లు వెల్లడించింది. విశాలమైన తమ ల్యాబ్స్లో కొవిడ్ నిబంధనల మేరకు స్కాలర్స్, ప్రాజెక్ట్ స్టాఫ్ తమ కార్యకలాపాలు నిర్వహించుకునే పరిస్థితులు ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. క్యాంపస్లోనే ఉండి తమ ప్రాజెక్టులను పూర్తి చేయాలని భావిస్తున్న విద్యార్థులకు తగిన వసతులు కల్పిస్తామని వెల్లడించింది. క్యాంపస్లో బస చేసే విద్యార్థులు, ప్రాజెక్ట్ సిబ్బంది అందరూ తమ హాస్టల్ గదులకు మాత్రమే పరిమితం కావాలని ఐఐటీ, మద్రాస్ ఆదివారం (డిసెంబర్ 13) విడుదల చేసిన సర్క్యులర్లో పేర్కొంది. మాస్కు ధరించడం, భౌతిక దూరం లాంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలని నిర్దేశించిందతి. కొవిడ్ లక్షణాలు కనిపించినవారు తక్షణమే అధికారులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3qU3XrL
0 Comments