ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య జరిగిన ఘర్షణతో మధ్య ఆసియాలో ఉద్రిక్తతలకు దారితీసింది. అయితే, ఈ ఉద్రిక్తతల విషయంలో భారత్ వైఖరిపై ఇజ్రాయేల్ గుర్రుగా ఉంది. మే16 న ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి, మే 20 న ఐరాస సర్వసభ్య సమావేశంలో చేసిన ప్రకటనలు విరుద్ధంగా ఉండటమే దీనికి కారణం. ఇజ్రాయేల్-పాలస్తీనా సంక్షోభంపై భారత్ చేసిన తొలి ప్రకటనలో ‘‘కేవలం పాలస్తీనా సమస్యకు మద్దతిస్తున్నామని... రెండు దేశాల ఏర్పాటు అనే పరిష్కారానికి అచంచలమైన నిబద్ధత’’తో ఉందని తెలిపింది. ఐరాస భద్రతా మండలిలో ప్రకటన చేసిన భారత్.. తర్వాత జరిగిన సాధారణ సభ సమావేశంలో భిన్నంగా మాట్లాడింది. కాల్పుల విరమణ ఒప్పందంపై ఇజ్రాయేల్ ప్రకటనతో 11 రోజులు ఘర్షణకు తెరపడింది. మే 20న సాధారణ సభలో హమాస్ రాకెట్ దాడులపై భద్రతా మండలిలో చేసిన ప్రకటనకు భిన్నంగా ఉంది. ‘‘గాజా నుంచి ఇజ్రాయేల్పైకి విచక్షణారహితంగా రాకెట్లను ప్రయోగించడాన్ని మేము ఖండిస్తున్నా.. ఇది అనేక మంది పౌరుల మరణాలకు కారణమైంది. గాజాలో ప్రతీకార దాడులు కూడా మరణాలు, విధ్వంసాలకు దారితీశాయి. ప్రస్తుత హింసలో భారతీయుడు సహా అమాయక పౌరుల ప్రాణాలు కోల్పోవడం చాలా బాధకరం’’ అని వ్యాఖ్యానించింది. హమాస్ దాడులకు ఖండించిన భారత్.. ఇజ్రాయేల్ వైమానిక దాడులను ఆత్మరక్షణ, ప్రతీకారంతో చేసినవి పేర్కొంది. ఇజ్రాయేల్, పాలస్తీనా మధ్య ప్రత్యక్ష చర్చలు తిరిగి ప్రారంభించడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించే ప్రతి ప్రయత్నం చేయాలని మేము నమ్ముతున్నాం.. ఈ బాధ్యత హమాస్పై ఉందని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇరు దేశాలూ సంయమనం పాటించి, ఉద్రిక్తతలను తగ్గించాలని సూచించింది. భద్రతా మండలిలో భారత్ చేసిన ప్రకటన.. ఇజ్రాయేల్కు మద్దతుగా ఉన్నట్టు స్పష్టతనిచ్చింది. కానీ, యుఎన్ఎస్సీలో ప్రకటనపై బీజేపీ మద్దతుదారుల నుంచే చాలా విమర్శలు వచ్చాయి. ఈ సమయంలో ఇజ్రాయేల్కు భారత్ తగినంతగా మద్దతు ఇవ్వడం లేదని, హమాస్ చర్యలను సమర్ధించడమేని విమర్శించారు. ఇజ్రాయేల్ కూడా ఇలాగే భావించింది. తమకు మద్దతుగా నిలిచిన చాలా దేశాలకు ధన్యవాదాలు తెలిపిన ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు.. భారత్కు మాత్రం చెప్పలేదు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2TlkCIB
0 Comments