బ్రిటిష్ పాలన నుంచి విముక్తి.. 400 ఏళ్ల తర్వాత గణతంత్ర దేశంగా బార్బడోస్

ప్రపంచంలో కొత్త గణతంత్ర దేశంగా క‌రీబియ‌న్ దీవుల్లోని బార్బ‌డోస్ ఆవిర్భ‌వించింది. బార్బ‌డోస్ బాధ్య‌త‌ల నుంచి రెండ‌వ క్వీన్ ఎలిజ‌బెత్ త‌ప్పుకోవడంతో ఆ దేశానికి పూర్తి స్వాతంత్రం లభించింది. రాజ్యాధినేత బాధ్యతల తొలగింపు కార్య‌క్ర‌మంలో ప్రిన్స్ చార్లెస్ పాల్గొన్నారు. దీంతో సోమ‌వారం అర్థ‌రాత్రి నుంచి బార్బ‌డోస్‌లో విదేశీ పాలన అంతమై గణతంత దేశంగా అవతరించింది. దాదాపు 400 ఏళ్ల త‌ర్వాత బ్రిటీష్ పాల‌న నుంచి బార్బ‌డోస్‌ పూర్తి స్వేచ్ఛ పొందింది. గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న డామి సాండ్ర మాస‌న్‌.. బార్బ‌డోస్ తొలి అధ్య‌క్షుడ‌య్యారు. కొత్త అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసి డామి సాండ్ర బాధ్య‌త‌లు స్వీక‌రించారు. మొత్తం 2,85,000 జ‌నాభా ఉన్న బార్బడోస్‌ 1625 నుంచి బ్రిటీష్ బానిస‌త్వంలో మ‌గ్గింది. అయితే 1966లో ఆ దేశం బ్రిట‌న్ నుంచి స్వాతంత్య్రం పొందింది. తిరిగి ఇన్నాళ్ల తర్వాత గణతంత దేశంగా అవతరించింది. బీచ్‌లు, క్రికెట్‌కు బార్బ‌డోస్ ప్రత్యేకత. ప్రమాణం చేసిన సాండ్ర.. ‘ప్రజలమైన మనం రిపబ్లిక్ బార్బడోస్‌కు దాని స్ఫూర్తిని.. దాని మూలాన్ని అందించాలి.. మనం ఒకరికొకరు.. మన దేశానికి సంరక్షకులం.. మనం ప్రజలం’ అని అన్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, జమైకాతో సహా 15 ఇతర రాజ్యాలకు ఇప్పటికీ రాణిగా ఉన్న ఎలిజబెత్ II తొలగింపును ఎట్టకేలకు దాని వలస చరిత్రలోని రాక్షసులతో విడదీయడానికి ఒక మార్గంగా పేర్కొంది. ‘ఈ రిపబ్లిక్ సృష్టి ఒక కొత్త ఆరంభాన్ని అందిస్తుంది’ అని ప్రిన్స్ చార్లెస్ అన్నారు. మన గతం చీకటి రోజుల నుంచి చరిత్రపై చెరిగిపోని మరక బానిసత్వం భయంకరమైన దురాగతం నుంచి ఈ ద్వీపంలోని ప్రజలు అసాధారణమైన ధైర్యంతో తమ మార్గాన్ని రూపొందించారు. ప్రిన్స్ చార్లెస్ మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య కొనసాగుతున్న స్నేహాన్ని ప్రస్తావిస్తూనే బానిసత్వం భయానకతను అంగీకరించారు. బానిసత్వాన్ని గత పాలకుల పాపంగా అభివర్ణించగా.. కొంతమంది బార్బడోస్ ప్రజలు బ్రిటన్ పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. శతాబ్దాలుగా రాజకుటుంబం బానిస వ్యాపారం నుంచి ప్రయోజనం పొందిందని సామాజిక కార్యకర్త డేవిడ్ డెన్నీ మండిపడ్డారు. ‘మా ఉద్యమం కూడా రాజకుటుంబం నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటుంది’ అని పేర్కొన్నారు. బార్బడోస్‌‌లోని చెరుకు తోటల్లో పనుల కోసం 1627 నుంచి 1823 మధ్య నాటి బ్రిటిష్ పాలకులు 6,0000 మంది నల్లజాతీయులను బానిసలుగా తీసుకొచ్చారు. ఇక, 15 వ శతాబ్దం నుంచి 19 వ శతాబ్దం మధ్య 10 మిలియన్లకుపైగా ఆఫ్రికన్లను ఐరోపా దేశాలు బానిసలుగా తీసుకొచ్చాయి.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3D5NjKK

Post a Comment

0 Comments