ఒమిక్రాన్‌నూ అడ్డుకునే యాంటీబాడీ చికిత్స.. యూకే ఆమోదం

కొవిడ్‌-19కు సరికొత్త యాంటీబాడీ చికిత్సకు బ్రిటన్‌ ఆమోదం తెలిపింది. అనే ఔషధాన్ని ది మెడిసిన్స్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ ప్రొడక్ట్స్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) ఆమోదించింది. ఇది ఒమిక్రాన్‌ వంటి కొత్త వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సోత్రోవిమాబ్‌‌ను సింగిల్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలతో తయారుచేశారు. ఇది కరోనా వైరస్‌పైన ఉండే స్పైక్ ప్రొటీన్‌కు అంటుకుంటుంది. తద్వారా అది వైరస్‌ను మానవ కణాల్లోకి ప్రవేశించకుండా నిలువరిస్తుంది. గ్లాస్కోస్మిత్‌క్లైన్ అభివృద్ధి చేసిన ఈ ఔషధం సురక్షితమైనదని, తీవ్రస్థాయి అనారోగ్యం ముప్పున్నవారికి బాగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఎంహెచ్‌ఆర్‌ఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ జూన్‌ రైనే తెలిపారు. సోత్రోవిమాబ్‌ను రక్తనాళాల ద్వారా 30 నిమిషాల పాటు ఇంజెక్ట్ చేస్తారు. 12 ఏళ్లు నిండినవారికీ దీనిని అందజేయవచ్చని జీఎస్కే తెలిపింది. అంతేకాదు, ముప్పు అధికంగా ఉండే పెద్దలు కొవిడ్‌ బారినపడితే ఆసుపత్రిలో చేరడం, మరణం ముప్పును 79 శాతం మేర తగ్గిస్తున్నట్టు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. వ్యాధి లక్షణాలు బయటపడిన వెంటనే దీన్ని ఇస్తే మంచి ప్రయోజనం ఉంటుందని పరిశోధకులు తెలిపారు. ఇప్పటికే నోటి ద్వారా తీసుకునే మోల్నూపిరావర్ మాత్ర అత్యవసర వినియోగం కింద ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ ఔషధం స్వల్ప నుంచి మోస్తరు కోవిడ్ లక్షణాలున్నవారికి వినియోగించవచ్చు. ఇక, సోత్రోవిమాబ్ వ్యాధి తీవ్రతను తగ్గించగలదని పేర్కొంది. ఊబకాయం, 60 ఏళ్లు దాటిన వృద్ధులు, డయాబెటిస్, గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యలున్నవారికీ ఇది రిస్క్ తగ్గిస్తుందని తెలిపింది. అయితే, సోత్రోవిమాబ్‌ని టీకాలకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించడానికి దీనిని తయారుచేయలేదన్నారు. ‘‘ఇది కోవిడ్ -19 ముప్పు ఎక్కువగా ఉన్నవారిని రక్షించడంలో ప్రభావవంతమైన మరొక చికిత్సా విధానం.. ఈ వినాశకరమైన మహమ్మారికి వ్యతిరేకంగా మన పోరాటంలో మరో ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది’’ అని జూన్ రైనే వ్యాఖ్యానించారు. అయితే, దీనిపై మరింత పరిశోధనలు అవసరమని నొక్కిచెప్పారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3pm0phW

Post a Comment

0 Comments