మహరాష్ట్రలో ఒమిక్రాన్ ప్రకంపనలు.. 28 మందికి పాజిటివ్?

దేశంలోకి వేరియంట్ అడుగుపెట్టినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గురువారం ప్రకటించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో ఓ వైద్యుడు సహా ఐదుగురిలో ఒమిక్రాన్ బయపడింది. అయితే, పలు రాష్ట్రాల్లోనూ అనుమానిత కేసులు బయటపడటం ఆందోళనకు గురిచేస్తోంది. మహారాష్ట్రలో ఇటువంటి అనుమానిత కేసులు 28కి చేరుకున్నాయి. ఒక్క ముంబయి మహానగరంలోనే 10 మంది ఒమిక్రాన్ వేరియంట్‌ బారినపడ్డట్టు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారి నమూనాలను జన్యు పరీక్షలకు పంపారు. ఒమిక్రానా? కాదా అనేది నిర్ధారించడానికి వీరందరి నమూనాలను జన్యు విశ్లేషణ కోసం పంపామని, దీనికి సంబంధించిన ఫలితాలు వచ్చే వారం వస్తాయని అధికారులు తెలిపారు. అయితే, బృహన్ ముంబయి కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులు మాత్రం ఈ పది మంది అనుమానితులకు నిర్వహించిన ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో ఆరుగురు నమూనాల్లో ఎస్-జన్యువు ఉందని, కాబట్టి ఒమిక్రాన్ అయ్యిండకపోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మిగతా వారి ఫలితాలు త్వరలోనే వెల్లడవుతాయని తెలిపారు. ఒమిక్రాన్.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల ద్వారా మాత్రమే గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. మూడు జన్యువులకు RT-PCR పరీక్షలను నిర్వహించాలని సూచించిస్తున్నారు. 'S'జన్యువు ఉందా? లేదా? అనేది గుర్తించడంలో ఇది సహాయపడుతుందని పేర్కొన్నారు. RT-PCR నివేదికలో 'N','S’,'E',‘ORF' జన్యువులు ఉంటాయన్నారు. ‘ఒక వ్యక్తిలో ‘S’జన్యువు లేకుండా మిగతావి పాజిటివ్‌గా సానుకూలంగా ఉంటే జన్యు విశ్లేషణ అవసరం లేకుండానే ఒమిక్రాన్ వేరియంట్ ఉందని పరోక్షంగా వెల్లడిస్తుంది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3xMMHbP

Post a Comment

0 Comments