అమెరికా సైన్యం వైదొలగిన తర్వాత అఫ్గన్ను ఆక్రమించుకున్న రెండోసారి అధికారం చేపట్టారు. తాత్కాలిక ప్రభుత్వానికి తాలిబన్ల సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్ జాదా నేతృత్వం వహిస్తున్నారు. కానీ, ప్రభుత్వం ఏర్పాటుచేసి నెలలు గడుస్తా జాదా జాడ బయట ప్రపంచానికి కనిపించకపోవడంతో మరోసారి పలు ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన ప్రాణాలతో ఉన్నారా? చనిపోయారా? అనేది స్పష్టతలేదు. ప్రభుత్వాన్ని నిజంగా ఎవరు నడిపిస్తున్నారనే దానిపై కూడా అత్యంత అంకితభావం కలిగిన విశ్లేషకులకు సందేహాలు ఉన్నాయి తమ నేత ప్రజల మధ్యకు వచ్చారని అక్టోబరు 30న తాలిబన్లు ప్రకటించిన విషయం తెలిసిందే. కాందహార్లోని దారుల్ ఉలుం హకిమియా మదర్సాలో ప్రసంగించారని, అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆయన అక్కడకు చేరుకున్నారని ప్రకటించారు. దీనికి సంబంధించిన ఫోటోలుగానీ, వీడియోలుగానీ తాలిబన్లు విడుదల చేయలేదు. కానీ, ఆయన ప్రసంగంలోని 10 నిమిషాల నిడివి గల కొంత భాగాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన ప్రసంగంలో ఎక్కడా రాజకీయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించని అఖుండ్ జాదా.. 20 ఏళ్లు శత్రువులతో పోరాడిన తాలిబన్ల నాయకత్వానికి దేవుడి ఆశీస్సులు ఉంటాయని మాత్రమే అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటున్న అఫ్గన్కు విజయం వరించాలని ప్రార్థించారు. ఆయన పబ్లిక్ ప్రొఫైల్ గతంలో ఇస్లామిక్ సెలవుల కోసం విడుదల చేసిన వార్షిక సందేశాలను పరిమితం చేశారు. కాందహార్ శివారులోని హకీమియా మదర్సా అక్టోబరు 30 నుంచి తాలిబాన్ మద్దతుదారులను ఇది ఆకర్షిస్తోంది. అజ్ఞాతం వీడి హకీమియా మదర్సాకు తొలిసారి వచ్చిన అఖుండ్ జాదా.. వెంట ముగ్గురు సెక్యూరిటీ గార్డులున్నట్టు ఏఎఫ్ఫీతో మదర్సా సెక్యూరిటీ చీఫ్ మాస్సామ్ షక్రుల్లా తెలిపారు. మొబైల్ ఫోన్లు, వాయిస్ రికార్డర్లను కూడా అనుమతించలేదన్నారు. మేమంతా ఆయన్నూ చూడగానే ఏడ్చేశామని అక్కడ విద్యార్ధి ఒకరు తెలిపారు. ఆయన ఖచ్చితంగా అఖుండ్ జాదాయేనా? అని అతడ్ని జర్నలిస్ట్ ప్రశ్నించగా.. ఆ సంతోషంలో ఆయన ముఖం చూడటం మరిచిపోయమని బదులిచ్చాడు. తాలిబన్లు అధికారంలోకి వచ్చినా అధినేత హైబతుల్లా అఖుండ్ జాదా అజ్ఞాతం వీడలేదు. ఇంతకు ముందు కూడా ఆయన ఎవరికీ కనిపించేవాడు కాదు. తాలిబన్లు ఆ మధ్య ఆయన ఫోటోలను విడుదల చేసేవరకు అఖుండ్ రూపురేఖలు కూడా బయటి ప్రపంచానికి తెలియవు. తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా మహమ్మద్ ఒమర్ 2015 చనిపోయిన తర్వాత ముల్లా మన్సూర్ అఖ్తర్ బాధ్యతలు చేపట్టారు. కానీ, 2016లో అఖ్తర్ను అమెరికా మట్టుబెట్టిన తర్వాత తాలిబన్లలో నాయకత్వం విషయమై అంతర్గత కలహాలు మొదలయ్యాయి. చివరకు అఖుండ్ జాదా ఎంపికతో వర్గపోరు ముగిసింది. అంతవరకు అమెరికా బారి నుంచి తప్పించుకోవడానికి రహస్య జీవితం గడిపిన అఖుండ్.. మతపరమైన సందేశాలు వెలువరించడం మినహా బయటకు వచ్చింది లేదు. జాదా కరోనా బారినపడ్డారని, అనారోగ్యానికి గురయినట్టు గతంలో వదంతులు వ్యాపించాయి. ఒకానొక సమయంలో ఆయన బాంబు పేలుడులో మరణించినట్లు ప్రచారం జరిగింది.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/3dvKCrz
0 Comments