ఎన్ని ఆంక్షలు పెట్టినా వెనక్కి తగ్గేదే లేదు.. మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుంది : రష్యా

ఉక్రెయిన్‌పై దాడులతో రష్యా ఇతర దేశాల ఆగ్రహాన్ని మూటగట్టుకుంది. దాంతో ఆ దేశంపై రష్యాతో సహా పలు దేశాలు ఆంక్షల కొరఢా ఝులిపించాయి. అయితే ఈ ఆంక్షల వల్ల, ఆ నియంత్రణల వల్ల తమ సైనిక చర్యను ఆపేది లేదని రష్యా తేల్చి చెప్పింది. పైగా ఆ దేశాలు పెట్టిన ఆంక్షలతో ఒరిగేదేమి లేదని, ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది. అలాగే ఉక్రెయిన్లోని డొన్బాస్ ప్రాంతాన్ని రక్షించే మిలటరీ ఆపరేషన్ కొనసాగుతుందని రష్యా స్పష్టం చేసింది . అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లక్ష్యాలను చేరే వరకు ఈ ఆగదని రష్యా భద్రతా మండలి డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదెవ్ తెలిపారు. "రష్యా ప్రెసిడెంట్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించే వరకు ఆపరేషన్ పూర్తిగా నిర్వహించబడుతుంది," అని అతను చెప్పారు. "ఆంక్షలు కేవలం కల్పితం, బూటకం మాటల కల్పన మాత్రమే అని ప్రజలందరూ గ్రహించారు" అని కూడా అన్నారు. కాగా గురువారం ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత రష్యాపై అమెరికా దాని మిత్రదేశాలు ఆంక్షలు విధించాయి. నాలుగు పెద్ద రష్యన్ బ్యాంకుల ఆస్తులను నిరోధించాలని, నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ‘‘మరో నాలుగు అతి పెద్ద రష్యా బ్యాంకులపై, పుతిన్‌కు సన్నిహితులైన ఆ దేశ కుబేరులపై కఠిన ఆంక్షలు విధిస్తున్నాం. ఆ బ్యాంకులకు, సంపన్నులకు చెందిన అన్ని ఆస్తులనూ జప్తు చేస్తున్నాం. ఇక అమెరికా, యూరప్‌ ఆర్థిక వ్యవస్థలతో రష్యాకు సంబంధాలన్నీ తెగిపోయినట్టే" అని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/QI041vV

Post a Comment

0 Comments