Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Monday, 24 February 2020

ట్రంప్‌తో విందుకు మాజీ ప్రధాని మన్మోహన్ దూరం.. కారణం ఇదేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ గౌరవార్థం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ మంగళవారం సాయంత్రం విందు ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. ఈ విందుకు పలువురు సీఎంలు, రాజకీయ ప్రముఖులను రాష్ట్రపతి ఆహ్వానించారు. ఈ ఆహ్వానం అందుకున్నవారిలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ కూడా ఉన్నారు. అయితే, ఈ విందుకు ఆయన హాజరు కావడం లేదు. తాను విందుకు రాలేకపోతున్నానని విచారం వ్యక్తం చేస్తూ మన్మోహన్ రాష్ట్రపతి కార్యాలయానికి సమాచారం అందజేశారు. ఆరోగ్య కారణాలతోనే తాను హాజరుకావడంలేదని మాజీ ప్రధాని రాష్ట్రపతికి కార్యాలయానికి తెలిపారు. అయితే, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆహ్వానం అందకపోవడంతో మన్మోహన్ ఈ విందుకు దూరంగా ఉన్నట్టు సమాచారం. సోనియా గాంధీకి ఆహ్వానం అందనప్పుడు తాము విందులో ఎలా పాల్గొంటామని గులామ్ నబీ ఆజాద్‌ పేర్కొన్నట్లు తెలిసింది. తాము రాష్ట్రపతి విందుకు హాజరు కావడం లేదని లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి వెల్లడించారు. అయితే, తాము విందుకు హాజరవుతామని గులామ్ నబీ ఆజాద్, అధీర్ రంజన్ ఛౌదరి ధ్రువీకరించారని, ఇప్పుడు వెళ్లడంలేదని ప్రకటించడం ఆశ్చర్యంగా ఉందని అధికార వర్గాలు ఆశ్చర్యం వ్యక్యం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడితో ప్రతిపక్ష నేతల సమావేశాన్ని ఏర్పాటుచేయకపోవడాన్ని కాంగ్రెస్ తప్పుబడుతోంది. విదేశీ ప్రతినిధులు వచ్చినప్పుడు ఈ సంప్రదాయం కొనసాగుతుందని, ప్రస్తుతం దాన్ని పక్కనబెట్టారని ఆరోపిస్తోంది. అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ అధినేతను అయితే, కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ ప్రభుత్వం పదేళ్లు కేంద్రంలో ఉన్నప్పుడు ఇద్దరు అమెరికా అధ్యక్షులు భారత్‌లో పర్యటించారు. ఆ సమయంలో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీజేపీ అధ్యక్షుడిని అమెరికా ప్రెసిడెంట్స్ గౌరవార్ధం ఏర్పాటు చేసిన విందుకు ఆహ్వానించలేదని విశ్వసనీయ వర్గాలు అంటున్నారు. రాష్ట్రపతి విందు మంగళవారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విందు పూర్తయిన తర్వాత ట్రంప్ తిరుగుపయనమవుతారు. ఢిల్లీ నుంచి బయలుదేరి జర్మనీ చేరుకుంటారు. అక్కడ రెండు రోజుల పాటు ట్రంప్ పర్యటించనున్నారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్.. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలను మంగళవారం సందర్శించనున్నారు. స్కూల్ విద్యార్థులతో ఆమె ముచ్చటించనున్నారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/32mQgpv

No comments:

Post a Comment