Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Wednesday, 24 March 2021

పుదుచ్చేరిలో వికసించనున్న కమలం.. టైమ్స్ నౌ ప్రీ పోల్ సర్వే

పుదుచ్చేరి శాసనసభ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయం సాధిస్తుందని టైమ్స్ నౌ-సీ ఓటర్ ప్రీ పోల్ సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ, ఎన్నార్‌ కాంగ్రెస్‌, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీయేకే ప్రజలు పట్టం కట్టనున్నట్టు వెల్లడయ్యింది. కాంగ్రెస్‌-డీఎంకే కూటమి రెండో స్థానానికి పరిమితం కానుందని తెలిపింది. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరిలో ఎన్డీయే 21 వరకు సీట్లను దక్కించుకోనుంది. ఆ కూటమికి 19 నుంచి 23 వరకు సీట్లు వస్తాయని అంచనా వేసింది. యూపీయే కూటమికి 7 నుంచి 11 సీట్లు వస్తాయని పేర్కొంది. మొత్తం 1,256 మంది సర్వేలో పాల్గొన్నారు. ఈసారి స్వతంత్రులు ఒక్క స్థానం కూడా దక్కించుకోలేరని సర్వేలో తేలింది. ఎన్‌డీయే కూటమికి 47.2 శాతం ఓట్లు దక్కించుకోనుంది. గత ఎన్నికలతో పోల్చితే ఇది 16.7 శాతం ఎక్కువ. యూపీయేకు 39.5 శాతం ఓట్లు దక్కనున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరికి ఓటేస్తారని అడిగితే యూపీయే 39. 5 శాతం, ఎన్‌డీఏ 47.2 శాతం, ఇతరులకు 13.3 శాతం మంది మొగ్గుచూపారు. ముఖ్యమంత్రిగా ఎవరిని ఎన్నుకుంటారన్న ప్రశ్నకు ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామికి అత్యధికంగా 49.8 శాతం, వి నారాయణస్వామికి 20 శాతం, ఇతరులకు 30 శాతం మంది మొగ్గుచూపారు. కేంద్ర ప్రభుత్వ పనితీరుపై కేవలం 20.35 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేయగా.. 32.73 మంది పర్వాలేదని, 38.6 శాతం మంది అధ్వాన్నంగా ఉందని, 8.36 శాతం మంది చెప్పలేమని అన్నారు. ఇక, రాష్ట్ర ప్రభుత్వ పనితీరు విషయానికి వస్తే 45.16 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేయగా.. 15.42 మంది చాలా బాగుందని, 24.76 శాతం పర్వాలేదని, మిగతా 14.66 శాతం మంది చెప్పలేమని తెలిపారు. ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యింది. 54.64 శాతం మంది బాగులేదని అన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పనితీరుపై 32.67 శాతం మంది బాగులేదని అన్నారు. 18.92 శాతం మంది చాలా బాగుందని, 25.31 శాతం మంది పర్వాలేదని తెలిపారు.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2QCqmfz

No comments:

Post a Comment