‘అయోధ్య అంశంలో మధ్యవర్తిత్వం విఫలమైంది’

యోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదానికి సంబంధించి శుక్రవారం (ఆగస్టు 2) సంచలన ప్రకటన చేసింది. వివాదాన్ని పరిష్కరించడానికి ముగ్గురు సభ్యులతో ఏర్పాటు చేసిన మధ్యవర్తిత్వ కమిటీ విఫలమైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ ఆధ్వర్యంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం వ్యాఖ్యానించింది. కమిటీ గురువారం సమర్పించిన నివేదికపై విచారణ జరిపి, ఎన్ని సంప్రదింపులు జరిపినా ఇరు వర్గాలను సంతృప్తి పరిచే ఆమోదయోగ్యమైన పరిష్కారం సూచించలేదని అభిప్రాయపడింది. ఆగస్టు 6 నుంచి తామే రోజువారీ విచారణ చేపడతామని పేర్కొంది. ఏళ్లుగా నలుగుతున్నఅయోధ్య వివాదానికి పరిష్కారం చూపాలంటూ ఈ ఏడాది మార్చి 8న సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీలో సభ్యులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఎఫ్.ఎం. ఖలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్‌లను సభ్యులుగా ఎంపిక చేసింది. దాదాపు నాలుగు నెలలపాటు త్రిసభ్య కమిటీ.. హిందూ ముస్లిం వర్గాలతో అనేక సమావేశాలు నిర్వహించి, కోర్టు ఆదేశాలతో జులై 18న తన నివేదిక సమర్పించింది. Read also: నివేదికను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం మధ్యవర్తిత్వాన్ని జులై 31 వరకు కొనసాగించి, ఆగస్టు 1న రిపోర్టు సమర్పించాలని కమిటీని ఆదేశించింది. దీంతో గురువారం ముగ్గురు సభ్యుల కమిటీ సీల్డ్ కవర్‌లో మరో రిపోర్టును అందజేసింది. శుక్రవారం విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య వివాదంలో మధ్యవర్తిత్వం విఫలమైందని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలనుసారం నివేదిక గోప్యంగా ఉంటుందని పేర్కొంది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2LWmwKJ

Post a Comment

0 Comments