BJP: తెలుగు మీడియా అధినేతను కలిసిన కేంద్ర మంత్రి.. మ్యాటర్ ఏంటి?

పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ మంగళవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఓ మీడియా ఛానల్ అధినేతను కలిశారు. ఎన్టీవీ బాస్ నివాసానికి వెళ్లి కలిసొచ్చారు. ఈ సందర్భంగా నరేంద్ర చౌదరి ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. మీడియా సంస్థ అధినేతను కేంద్ర మంత్రి కలవడానికి ఎలాంటి రాజకీయ కారణాలు లేవని తెలుస్తోంది. కీలక నేతలు, కేంద్ర మంత్రులు మహాసంపర్క్‌ పేరిట వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కలుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రహ్లాద్ జోషి కూడా ‘మహాసంపర్క్’లో భాగంగానే నరేంద్ర చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టికల్ 370 రద్దు, తర్వాతి పర్యావసనాలను కేంద్ర మంత్రి నరేంద్ర చౌదరికి వివరించారు. ఈ సందర్భంగా.. కేంద్ర మంత్రికి సాదర స్వాగతం పలికిన ఎన్టీవీ బాస్.. ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ప్రహ్లాద్ జోషితోపాటు బీజేపీ నేతలు కె.లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, మురళీధర్ రావు, సత్యకుమార్, సంతోష్ తదితరులు కూడా నరేంద్ర చౌదరిని కలిశారు. సంగతి పక్కనబెడితే... ఏపీ, తెలంగాణల్లో బీజేపీ చేయబోయే పోరాటాలకు, కమలనాథుల గళం వినిపించడానికి మీడియా అండగా నిలవడం కోసం ఈ తరహా భేటీలు ఉపయోగపడతాయి. ఎందుకంటే.. తెలుగులో నంబర్ వన్‌గా ఉన్న టీవీ 9 ఛానల్ ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఉండే అవకాశాలున్నాయి. నంబర్ 2గా ఉన్న ఎన్టీవీని తమకు అనుకూలంగా మలుచుకుంటే ఫలితం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారేమో.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2Q9bRPt

Post a Comment

0 Comments