సుశాంత్ ఆత్మహత్య‌పై రాహుల్ ట్వీట్.. నెటిజన్స్ ట్రోల్

బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య అందర్నీ కలిచి వేసింది. దీంతో సినీ ప్రముఖుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు సుశాంత్ మరణ వార్త విని షాక్ అయ్యారు. దీంతో అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ప్రముఖులంతో సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సుశాంత్ మరణ వార్తపై స్పందించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. ఇక కాంగ్రెస్ నేత , ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కూడా సుశాంత్ మరణంపై స్పందించారు. అయితే ఆయన చేసిన ట్వీట్‌ను నెటిజన్స్ ట్రోల్ చేశారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. రాహుల్‌ గాంధీ పేరిట సోషల్ మీడియాలో ఓ ట్వీట్‌ తెగ వైరల్‌ అయింది. దీంతో రాహుల్‌ను నెటిజన్లు ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. అయితే ఆ ట్వీట్‌ ఫేక్‌ అని తేలింది. అసలు సంగతి చూస్తే... సుశాంత్‌ మరణంపై విచారం వ్యక్తం చేస్తూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. సుశాంత్‌ను క్రికెటర్‌ అన్నారంటూ ఓ స్క్రీన్‌ షాట్‌ తెగ వైరల్‌ అయింది. దీంతో రాహుల్‌ను నెటిజన్లు ఓ ఆటాడుకున్నారు. దీనిపై వెంటనే స్పందించిన రాహుల్‌ ఫాలోవర్స్‌.. రాహుల్ చేసిన అసలు ట్వీట్‌ని సోషల్‌ మీడియాలో షేర్‌ చూసి, అది ఫేక్‌ అని పేర్కొన్నారు. దీంతో రాహుల్ గాంధీపై ట్రోల్స్‌కు చెక్ పడినట్లు అయ్యింది. ఇక ఆదివారం తన నివాసంలో సుశాంత్‌ ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఎంఎస్ ధోనీ: ద అన్ టోల్డ్' చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి సినీ పరిశమ్రకు కోలుకోలేని షాక్ తగిలింది. తాజాగా సుశాంత్ ఇంట మరో విషాదం కూడా చోటు చేసుకుంది. సుశాంత్ మరణం తట్టుకోలేక ఆమె వదిన కూడా అకస్మికంగా ఇవాళ మృతి చెందింది. దీంతో సుశాంత్ ఫ్యామిలీకి కోలుకోలేని మరో దెబ్బ తగిలింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3d7nLzA

Post a Comment

0 Comments