రోడ్డుప్రమాదంలో సబ్ఇన్స్పెక్టర్ దుర్మరణం పాలైన ఘటన తమిళనాడులోని విరుదునగర్లో శుక్రవారం జరిగింది. తెన్కాశి పట్టణానికి చెందిన సాల్మన్ వేదమణి కుమారుడు ప్రతీష్(30) చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో సబ్ ఇన్స్పెక్టరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చిన అతను తిరిగి విధుల్లో చేరడానికి గురువారం బైక్పై బయలుదేరాడు. విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూర్ సమీప నత్తంపట్టి వద్ద ఎదురుగా ఇసుక లోడుతో వస్తున్న టిప్పర్ అతడి బైక్ను వేగంగా ఢీకొంది. Also Read: ఈ ప్రమాదంలో ప్రతీష్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న నత్తంపల్లి పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీవిల్లిపుత్తూర్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారాన్ని అతడి తల్లిదండ్రులకు చేరవేశారు. టిప్పర్ డ్రైవర్ జ్ఞానగురువు నిర్లక్ష్యంగా నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2XUhmDI
0 Comments