అమ్మాయి కోసం రెండు గ్రూపుల ఘర్షణ.. గుంటూరులో కలకలం రేపిన గ్యాంగ్‌ వార్

కొద్దిరోజుల క్రితం విజయవాడలో జరిగిన గ్యాంగ్ వార్ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో సందీప్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇదే తరహాలో ఇప్పుడు గుంటూరు జిల్లాలోనూ రెండు గ్రూపుల మధ్య ఆదివారం రాత్రి గ్యాంగ్ వార్ జరిగింది. ఓ యువతి కోసం ఇద్దరు యువకులు తమ ఫ్రెండ్స్‌తో కలిసి రెండు గ్రూపులుగా విడిపోయి విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. విజయవాడ ఉదంతంతో ఉలిక్కిపడిన ప్రజలు.. తాజాగా గుంటూరు ఘటనతో మరింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... వసంతరాయపురానికి చెందిన ప్రణయ్‌ గుంటూరు రూరల్‌ చౌడవరం సమీపంలోని ఓ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడికి గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌కు చెందిన ఓ యువతితో కొన్నాళ్లుగా స్నేహం కొనసాగుతోంది. ఇటీవల ఆమె ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్‌కు కృష్ణానగర్‌ ప్రాంతానికి చెందిన ఆవుల దినేష్ అలియాస్ సన్నీ అసభ్యకర మెసేజ్‌లు పంపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి ప్రణయ్‌కు చెప్పడంతో అతడు సన్నీకి సోషల్‌మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చాడు.

ఈ క్రమంలోనే ఇద్దరూ అసభ్యకరంగా ఛాటింగ్ చేసుకుంటూ మాటామాట పెరిగింది. దమ్ముంటే చూసుకుందాం.. నేరుగా కలవాలని ఇద్దరూ సవాల్ చేసుకుంటూ ఫోన్ నంబర్లు షేర్ చేసుకున్నారు. నేరుగా సత్తా చూపించుకునేందుకు డొంకరోడ్డు వద్ద ఖాళీ ప్రదేశాన్ని ఎంచుకున్నారు. దీంతో ఆదివారం రాత్రి సుమారు 40-50 మంది యువకులు క్రికెట్ బ్యాట్లు, కర్రలు, రాడ్లతో అక్కడికి చేరుకున్నాడు. వారిని చూసిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడి నుంచి పిచ్చుకుల గుంట వద్దకు చేరుకుని రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అరండల్‌పేట స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ ఒకరు వెంటనే ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావుకు సమాచారం అందించారు.

Also Read:

సీఐ వేధింపులు.. మహిళా హెడ్‌‌కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

పోలీసులు వచ్చేటప్పటికి అక్కడి వాతావరణం రణరంగాన్ని తలపిస్తూ యువకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటూ కనిపించారు. కొందరు పోలీసులను చూసి పారిపోయి.. మిగిలిన వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో గుంటూరు రూరల్ జిల్లా పరిధిలోని ఓ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్ఐ కుమారుడు ఉన్నట్లు తెలుస్తోంది. యువతి విషయంలో విద్యార్థుల ఘర్షణపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. అరండల్‌పేట పీఎస్‌లో ఉన్న యువకులను సోమవారం అడిషనల్‌ ఎస్పీ డి. గంగాధరం, వెస్ట్‌ డీఎస్పీ బీవీ రామారావు, స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో బత్తుల శ్రీనివాసరావు విచారించారు.

Also Read:

మూడేళ్లు ప్రేమించి పెళ్లికి మొహం చాటేసిన ప్రియుడు.. మహిళ ఆత్మహత్య

ఘర్షణలకు కారణాలను వెలికితీసే పనిలో పడ్డారు. యువతి కారణంగానే ఈ గ్యాంగ్ వార్ జరిగిందా? లేక ఇతర కారణాలేవైనా ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన యువకులపై ఏవైనా కేసులున్నాయా? అని ఆరా తీస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోబోమని ఏఎస్పీ గంగాధరం స్పష్టం చేశారు. సంఘటనా స్థలం నుంచి పరారైన యువకుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయవాడ ఉదంతంతో అప్రమత్తమైన గుంటూరు పోలీసులు ఇలాంటి ఘటనలు జరగకుండా చెక్ పెట్టాలని యోచిస్తున్నారు.

Also Read:

గద్వాల: వేరే కులస్థుడితో ప్రేమ, ఆపై గర్భం.. దారుణంగా చంపేసిన తల్లిదండ్రులు



from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/37hDgE6

Post a Comment

0 Comments