పిల్లలు సరదా సంతోషాల్ని తల్లిదండ్రులు ఎప్పుడు కాదనలేరు. వారికి ఏం కావలంటే అది లేదనకుండా కొనిపెడుతుంటారు. పిల్లల్ని ఏ లోటు లేకుండా పెంచుకోవాలనుకుంటారు. తాాజాగా ఓ చిన్నారి తనకు కొత్త సైకిల్ కొని పెట్టాలని కోరిన కోర్కెను తల్లిదండ్రులు కాదనలేకపోయారు. కన్న బిడ్డ కోరికను మన్నించి సైకిల్ కొని పెట్టారు. అయితే ఆ సైకిలే తమ బిడ్డ ప్రాణం తీస్తుందని వారు ఏ మాత్రం ఊహించలేకపోయారు. సైకిల్ తొక్కుతూ సరదాగా వెళ్లిన చిన్నారి బావిలో శవమై తేలాడు. ఈ విషాదకరమైన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రేవంత్ సైకిల్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. తల్లిదండ్రులు కొత్త సైకిల్ కొనివ్వడంతో ఆదివారం మధ్యాహ్నం ఇంటి సమీపంలోని సరదాగా ఆడుకున్నాడు. ఇంతలోనే ప్రమాద వశాత్తు వ్యవసాయ బావిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం అయినా తమ బిడ్డకు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రలు ఆందోళన చెందారు. తెలిసినవారి ఇళ్లతో పాటు... ఊరంతా గాలించారు. అయినా బాలుడు ఆచూకీ దొరకలేదు. దీంతో స్థానికుల సమాచారం మేరకు.. ఓ వ్యవసాయ బావిలో వెతకగా మృతదేహంతోపాటు సైకిల్ కనిపించింది. అర్థరాత్రి వరకు నీటిని తోడి బాలుడి మృతదేహం బయటకు తీశారు. అప్పటివరకు సైకిల్తో సరదాగా ఆడుకునే.. తమ బిడ్డ ఇక లేడన్న చేదు వార్తతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3cLDx38
0 Comments