భర్త కోపానికి కుటుంబం బలి.. ఆరుగురి మృతి

భర్త కోపానికి ఓ కుటుంబం బలైపోయింది. మద్యం మత్తులో గొడవపడి భార్యాబిడ్డలని అతి కిరాతకంగా చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని ఆవేశానికి ఆరుప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లో జరిగింది. జిల్లా ఖేర్వారా సమీపంలోని రోబియా హొలిఫలాన్‌కి చెందిన రంజీత్ మీనా(32) మద్యానికి బానిసయ్యాడు. నిత్యం భార్య కోకిల(28)తో గొడవపడేవాడు. మరోమారు ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రంజీత్ ఆగ్రహంతో రగిలిపోయాడు. భార్యని దారుణంగా నరికి చంపేశాడు. ఇంట్లోనే ఉన్న నలుగురు పిల్లలను హతమార్చాడు. కొడుకులు నరేంద్ర(3), లోకేష్(5), జశోదా(8), 9 నెలల పసిపాపను అతి కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం ఇంటి నుంచి బయటికొచ్చి చెట్టుకి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రంజీత్ మద్యానికి బానిసయ్యాడని..తరచూ భార్యతో గొడవపడేవాడని తమ విచారణలో తెలిసిందని ఖేర్వారా ఇన్‌స్పెక్టర్ తెలిపారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3pjOGyE

Post a Comment

0 Comments