చలి చంపేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రదేశాల్లో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జమ్మూ కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని సరస్సులు, చెరువులు గడ్డకట్టుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో వారం రోజులుగా 5 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక శీతల దేశాల్లో పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలికి గడ్డకట్టుకుపోయిన సరస్సుల మీద నడుస్తూ కొంత మంది పర్యాటకులు ప్రత్యేక అనుభూతి పొందుతున్నారు. అయితే.. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ.. ఓ వన్య ప్రాణి కూడా ఇలాగే ఓ గడ్డకట్టిన సరస్సు మీదకి వచ్చింది. ఆ మంచు మీద నడవలేకపోయింది. ఎంత ప్రయత్నించినా.. కాళ్లు జారిపోయి అడుగులు ముందుకు పడలేదు. జింక అవస్థను గమనించిన ఓ స్థానికుడు దానికి సాయం చేశాడు. సరస్సు మధ్య నుంచి దాన్ని ఓ చివర వరకు చేతులతో నెట్టుకొచ్చాడు. దీంతో అది ఒడ్డుకు చేరి వనంలోకి పారిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలను ఈ వీడియోలో మీరూ చూసేయండి.. వన్య ప్రాణి పట్ల అతడు చూపిన ప్రేమకు హ్యాట్సాఫ్ కూడా చెప్పండి.. సిమ్లాలో ఇలా.. హిమాలయ పర్వతాలకు సమీపంగా ఉన్న జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. ఇళ్లపైన, రోడ్లపైనా మంచు పేరుకుపోయింది. హిమాచల్ ప్రదేశలోని సిమ్లాలో ఓ సరస్సు గడ్డకట్టుకుపోయింది. లాహౌల్-స్పితి జిల్లా జోబ్రాంగ్లో గల ఖొలుడు సరస్సు పూర్తిగా మంచుగడ్డలా మారిపోయింది. కొంత మంది పర్యాటకులు ఆ గడ్డకట్టిన సరస్సుపై నడుస్తూ ఆహ్లాదం పొందుతున్నారు. Must Read: ✦ ✦ ✦
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/34LJI6i
0 Comments