Nepal Crisisలో ఊహించని షాక్.. ప్రభుత్వ ఏర్పాటులో రగడ.. పార్లమెంట్‌ రద్దు

నేపాల్‌ ఏర్పడిన రాజకీయం సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు నేపాల్‌ ప్రధాని , ప్రతి పక్షకూటమి పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తుండగా.. అధ్యక్షురాలు బిద్యాదేవి బండారి వారికి ఝలక్ ఇచ్చారు. పార్లమెంటు సభ్యుల సంతకాలతో కూడిన లేఖలను కేపీ శర్మ ఓలీ, కాంగ్రెస్ నేత బహదూర్ ద్యూబా శుక్రవారం అధ్యక్షురాలికి అందజేశారు. అయితే, శుక్రవారం అర్ధరాత్రిలోగా కొత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షురాలు భండారి గడువు విధించారు. ఈ గడువులోగా ఇరు పక్షాలూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయాయి. దీంతో పార్లమెంట్‌ను రద్దు చేస్తున్నట్లు అధ్యక్షురాలు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎన్నికలను ఎప్పుడు నిర్వహించాలనేది తేదీలను కూడా వెల్లడించారు. నవంబరు 12న తొలి విడత, నవంబరు 19న రెండో విడత ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ నేపాల్‌-యునైటెడ్‌ మార్కిస్ట్ -లెనిని‌స్ట్ (సీపీఎన్‌-యూఎంఎల్‌)కి చెందిన 121 మంది, జనతా సమాజ్‌వాదీ పార్టీ-నేపాల్‌(జేఎస్పీ-ఎన్‌)కు చెందిన 32 మంది కలిపి తనకు 151 మంది మద్దతున్నట్టు కేపీ శర్మ ఈ మేరకు లేఖను అందజేశారు. అంతకు ముందు నేపాల్‌ కాంగ్రెస్‌ నేత షేర్‌ బహదూర్‌ ద్యూబా నాయకత్వంలో ప్రతిపక్షకూటమి 149 మంది సభ్యులు సంతకాలు చేసిన లేఖను అందజేసింది. మొత్తం 275 మంది సభ్యులున్న నేపాల్‌ పార్లమెంట్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు 136 మంది మద్దతు అవసరం. తొలుత విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కేపీ శర్మ ఓలీ మే 14న మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 30 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని అధ్యక్షురాలు గడువు విధించారు. ఈ విశ్వాసపరీక్ష నెగ్గాలంటే ప్రతినిధి సభలో 136 ఓట్లు రావాలి. అయితే ఆయన మరోసారి బలపరీక్షకు ఆసక్తి చూపడంలేదని గురువారం వార్తలు వెలువడటంతో ప్రభుత్వం ఏర్పాటుకు ప్రతిపక్ష కూటమి ముందుకు వచ్చింది. ఓలి గతేడాది డిసెంబరులో రద్దు చేయగా.. అది చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పటి నుంచి నేపాల్‌లో రాజకీయ సంక్షోభం ముదిరింది.


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3hOWJmG

Post a Comment

0 Comments