Trending news India this blog updates India wide Telugu news updates minute to minute, Telugu viral news, Telugu sports news, Telugu political news, Telugu movie news, IndianTelugu news updates.

Tuesday, 22 December 2020

టీనేజర్‌తో భార్య ఎఫైర్.. ప్రియుడిని మళ్లీ మళ్లీ రెచ్చగొట్టి.. దారుణం

పెళ్లైన మహిళ టీనేజ్ యువకుడితో ప్రేమలో పడింది. అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆ విషయం భర్తకి తెలిసిపోవడంతో పుట్టింటికి చేరింది. ప్రియుడితో కలసి ఉంటోంది. అయితే ఎప్పటికైనా భర్త తమకు అడ్డు అని భావించిన భార్య దారుణానికి ఒడిగట్టింది. ప్రియుడితో కలసి కట్టుకున్న భర్తను అమానుషంగా అంతమొందించింది. ప్రియుడు భయపడినా ఆమె వెనక్కి తగ్గలేదు. కిరాతకంగా హత్య చేయించింది. ఈ అత్యంత దారుణ ఘటన జిల్లాలో వెలుగుచూసింది. కోస్గి పట్టణ శివారులో ఈ నెల 18న అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, ఆమె ప్రియుడు భర్తని హత్య చేసినట్లు తేల్చారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామానికి చెందిన ఆంజనేయులు(35)కి కోస్గి మండలం కడంపల్లికి చెందిన లక్ష్మితో ఏడేళ్ల కిందట వివాహమైంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా భార్యాభర్తలు ఉపాధి కోసం తాండూర్ వెళ్లి కూలీ పనులు చేసుకునేవారు. అదే సమయంలో భార్య లక్ష్మికి టీనేజ్ యువకుడితో పరిచయమై అక్రమ సంబంధానికి దారితీసింది. ఆ విషయం భర్తకి తెలిసి ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో ఆమె పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరింది. అక్కడ ఉంటూ ప్రియుడితో సంబంధం కొనసాగిస్తోంది. తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన లక్ష్మి దారుణానికి పాల్పడింది. భర్తను చంపేయాలని నిర్ణయించుకుని ప్రియుడికి చెప్పింది. ఇద్దరూ కలిసి భర్త హత్యకు పథకం రచించారు. బంధువుల ఇంట్లో విందు ఉందని.. రావాలంటూ ఈ నెల 17న ఆంజనేయులుని ఫోన్ చేసి రప్పించారు. ఉదయం నుంచి రాత్రి వరకూ ఫుల్లుగా మద్యం తాగించారు. అనంతరం పట్టణ శివారులోని బస్ డిపో ప్రాంతంలో అతని కాళ్లూచేతులు కట్టేసి నరాలు లోతుగా కట్‌చేయడంతో తీవ్ర రక్తస్రావమై మృతి చెందాడు. మరుసటి రోజు అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమవడంతో కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపట్టారు. Read Also: కోడలే తన కొడుకును హత్య చేసిందని మృతుడి తల్లి ఆరోపించడంతో ఆ దిశగా దర్యాప్తు చేసిన పోలీసులకి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుని భార్య లక్ష్మిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో అసలు నిజాలు కక్కేసింది. ఆమె ప్రియుడితో కలసి భర్తను హత్య చేసినట్లు తేలింది. టీనేజ్ యువకుడు(మైనర్) అయిన ఆమె ప్రియుడు హత్య చేసేందుకు భయపడినా ఆమె మళ్లీ మళ్లీ ఫోన్ చేసి ప్రోత్సహించి మరీ భర్తని హత్య చేయించినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. నిందితురాలిని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. Also Read:


from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/3rmCmQd

No comments:

Post a Comment