నగరంలో ఐదేళ్లుగా చోరీలకు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న ముసుగుదొంగను హైదరాబాద్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. ముఖానికి ముసుగు ధరించి, సుత్తి, గడ్డపార వంటి ఆయుధాలతో ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడటం ఇతడి నైజం. నగరంలోని చాలాచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినా అతడు ముసుగు ధరించుకుని ఉండటంతో పోలీసులకు పట్టుకోవడం సవాల్గా మారింది. అయితే తాజాగా రోడ్డుపై అనుమానాస్పదంగా తిరుగుతున్న అతడిని పోలీసులు ప్రశ్నించడంతో ముసుగుదొంగ నేర చరిత్ర బయటపడింది. Also Read: పోలీస్స్టేషన్ పరిధిలోని పీలి దర్గా వద్ద సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి దగ్గరికి వెళ్లి ఇక్కడేం చేస్తున్నావంటూ ప్రశ్నించగా తడబడుతూ సమాధానాలు చెప్పాడు. దీంతో పోలీసులు అతడిని పోలీస్స్టేషన్కు తీసుకెళ్లి ప్రశ్నించగా ఐదేళ్ల నేర చరిత్ర అంతా బయటపెట్టాడు. ఇన్నాళ్లుగా తాము వెతుకుతున్న ముసుగు దొంగ అతడేనని పోలీసులు నిర్ధారించుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు తలరించారు. Also Read: పోలీస్ కమిషనర్ అంజనీకుమార్.. సీసీఎస్ సంయుక్త కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడకు చెందిన మహ్మద్ సమీర్ అలియాస్ లాలా(36) కారుడ్రైవర్గా పనిచేస్తున్నాడు. వచ్చే ఆదాయం పోషణకు సరిపోకపోవడంతో దొంగ అవతారమెత్తాడు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుని రాత్రిళ్లు ముసుగు వేసుకుని చోరీలకు పాల్పడేవాడు. చాంద్రాయణగుట్ట పీఎస్ పరిధిలో ఇప్పటివరకు 9ఇళ్లల్లో చోరీలు చేసి రూ. 25లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులు దోచుకున్నాడు. ఈ దొంగపై ఎప్పటి నుంచో నిఘా పెట్టగా సోమవారం తెల్లవారుజామున అనూహ్య రీతితో పట్టుబడ్డాడని కమిషనర్ తెలిపారు. Also Read:
from Telugu News Live | Today News in Telugu | తాజా తెలుగు వార్తలు https://ift.tt/2IaBEAK
0 Comments