2 వారాల తర్వాత లభ్యమైన పైలట్ మృతదేహం.. మరొకరి కోసం కొనసాగుతోన్న గాలింపు

జపాన్‌లో ఓ పైలట్ మృతదేశం రెండు వారాల తర్వాత లభ్యమైంది. మరొకరి కోసం గాలింపు సాగుతోంది. అదృశ్యమైన ఫైటర్ జెట్‌లోని ఇద్దరు సిబ్బందిలో ఒకరి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్టు జపాన్ వైమానిక దళం ఆదివారం తెలిపింది. ట్రైనింగ్ మిషన్‌లో ఉండగా మిస్ అయింది. 15 రోజుల క్రితం సెంట్రల్ ఇషికావా ప్రాంతంలోని కొమట్సు ఎయిర్‌బేస్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే రాడార్ నుంచి అదృశ్యమైంది. దీంతో ఆ జెట్‌ కోసం అధికారులు సెర్చింగ్ మొదలుపెట్టారు. సెర్చ్ ఆపరేషన్స్‌లో భాగంగా శుక్రవారం ఒక మృతదేహాన్ని కనుగొన్నట్టు అక్కడ వైమానిక దళ సిబ్బంది తెలిపారు. మృతదేహాన్ని గుర్తింపును ధ్రువీకరించినట్టు మిలటరీ తెలిపింది. అయితే ఆ పైలట్‌ను పేరును వెల్లడించలేదు. అలాగే అతని కో-పైలట్ కోసం సెర్చింగ్ సాగుతుంది. అయితే విమానం ఎలా కూలిపోయిందనే విషయంపై స్పష్టత లేదు. కాగా గతంలో జపాన్‌లో ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. 2019లో ఒక F-35A స్టెల్త్ జెట్ సముద్రంలోకి కూలిపోయింది. వాతావరన పరిస్థితులు అనుకూలించక పైలట్ అయోమయానికి గురి కావడంతో ఈ ప్రమాదం జరిగింది. అప్పుడు కూడా కోసం సెర్చింగ్ నిర్వహించాల్సి వచ్చింది.


from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/ey1FqkB

Post a Comment

0 Comments