ఉత్తర భారతంలో భూప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా, శనివారం ఉదయం ఉత్తరాఖండ్లో స్వల్ప సంభవించింది. ఉదయం 5.03 గంటలకు ఉత్తరకాశీలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో భూమికి 28 కి.మీ. లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. వారం వ్యవధిలో ఉత్తరాఖండ్లు భూ ప్రకంపనలు రావడం ఇది మూడోసారి. గత ఆదివారం కూడా 4.1 తీవ్రతో భూమి కంపించింది. అంతకుముందు రోజు (ఫిబ్రవరి 5న) కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈ భూకంప కేంద్రం అఫ్గనిస్థాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నట్టు తెలిపింది. ఈనెల 10న జమ్ముకశ్మీర్ సహా ఢిల్లీ పరిసర ప్రాంతాలు, ఉత్తరాఖండ్లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి. ప్రజలు నిద్రలో నుంచి మేల్కొంటున్న వేళ భూ ప్రకంపనలు రావడంతో భయపడి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే, భూకంపం వల్ల ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 7.0 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే సాధారణం కంటే ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. 2.0 లేదా అంతకంటే తక్కువ తీవ్రతతో సంభవించేవి మైక్రో భూకంపం.. ఇవీ సర్వ సాధారణంగా జరుగుతాయి. అయితే, 4.1 తీవ్రతతో సంభవించే భూకంపాల వల్ల గృహాలు, ఇతర నిర్మాణాలు దెబ్బతింటాయి.
from Latest News in Telugu | Telugu Breaking News | బ్రేకింగ్ న్యూస్ Telugu | Samayam Telugu https://ift.tt/SmdgW4c
0 Comments